కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారు: రఘురామ

ABN , First Publish Date - 2021-12-04T22:02:57+05:30 IST

కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దీనిపై గత నెల 10న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ

కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారు: రఘురామ

ఢిల్లీ: కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దీనిపై గత నెల 10న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశానని తెలిపారు. ప్రజాధనం వృధాకావొద్దనే లేఖ రాశానని పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు పాడయ్యాయి.. అందులో భాగంగానే నీటి తాకిడికి గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. జగనన్న శాశ్వత గృహ హక్కు కాదు.. జగనన్న నిర్బంధ గృహ హక్కులగా ఉందని విమర్శించారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలు చేపడితే.. ఇప్పుడు వాటికి పన్నులు వేస్తున్నారని, ఇదేం సిద్ధాంతమో సీఎం జగన్‌ చెప్పాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.



Updated Date - 2021-12-04T22:02:57+05:30 IST