రెండు, మూడు రోజుల్లో దాడి జరగనుంది.. ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2020-09-26T19:10:22+05:30 IST

నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని..

రెండు, మూడు రోజుల్లో దాడి జరగనుంది.. ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని.. మరో రెండు, మూడు రోజుల్లో దాడి జరగనుందని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. దాడి చేస్తే ఆవేశపడి ఓ మాట అనే అవకాశం ఉందనే ఆలోచనల్లో వాళ్లు ఉన్నారన్నారు. తోలు తీస్తా అన్నారని, ఊళ్లోకి రా.. పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టేస్తామని హెచ్చరించిన విషయాలను గుర్తు చేశారు. ఓ ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే.. దానికి ఓ జాతిని సంఘటితం చేసి.. వాళ్ల జాతిని అవమానించినట్టు చిత్రీకరించారన్నారు. తను అన్న మాటలకు రుజువులు ఉన్నాయని, తన వెనక జరుగుతున్న కుట్ర తెలియాలనే ఈ విషయాలు తెలుపుతున్నానన్నారు. దాడి వార్తలు సాక్షి ఛానెల్, పేపర్‌లలో వస్తాయన్నారు. ఎంతోమంది దళిత సంఘాలు ఫోన్ చేస్తున్నాయని, తనకు మద్దతుగా ఉంటున్నారని చెప్పారు. దీనిపై దళిత హిందూ నాయకులు తనతో మాట్లాడారని, వారి హక్కుల కోసం పోరాడటంతోనే తనకు మద్దతుగా నిలిచారన్నారు. దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని... ఈ విషయాన్ని తాను పలు సార్లు ప్రస్తావించానన్నారు. అందుకే హిందూ దళిత నాయకులు తన వెంట నిలిచారన్నారు.   

Updated Date - 2020-09-26T19:10:22+05:30 IST