శాసనమండలి రద్దు చేయాలంటూ సీఎం జగన్‌కు రఘురామ లేఖ

ABN , First Publish Date - 2021-06-21T15:35:41+05:30 IST

శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్‌కు రఘురామ లేఖ రాశారు.

శాసనమండలి రద్దు చేయాలంటూ సీఎం జగన్‌కు రఘురామ లేఖ

న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు.


క్రమశిక్షణగల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానని రఘురామ అన్నారు. సీఎం జగన్ విలాసాలకు రూ. 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated Date - 2021-06-21T15:35:41+05:30 IST