jagan బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్
ABN , First Publish Date - 2021-10-06T21:54:01+05:30 IST
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో జగన్, బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో దాఖలైన పిటీషన్పై హైకోర్టు విచారణ చేయనుంది. ఇదే విషయంపై రఘురామ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ఈడీ కోర్టుకు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలని రఘురామ అన్నారు.