ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ABN , First Publish Date - 2021-05-18T06:07:50+05:30 IST
వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేడ ర్లలో గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యో గులను రెగ్యులర్ చేయాలని హెల్త్ అడ్మినిష్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంసా) జిల్లా కార్యదర్శి వి.సుజాత డిమాండ్ చేశారు.
మార్కాపురం (వన్టౌన్). మే 17: వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేడ ర్లలో గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యో గులను రెగ్యులర్ చేయాలని హెల్త్ అడ్మినిష్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంసా) జిల్లా కార్యదర్శి వి.సుజాత డిమాండ్ చేశారు. స్థానిక భగత్సింగ్ కాలనీలో సోమవారం మార్కాపురం తాలుకా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కరోనా విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యారోగ్యశాఖ ఉద్యోగినికి ఆర్థిక సాయం చేసిన మంత్రి బాలినేనికి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ వల్ల అనేక మం ది ఉద్యోగులు మరణిస్తున్నారని. వారి జాబితాను జిల్లా అధ్యక్షుడు రాజా రావు త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తారని చెప్పారు. సంఘ తాలూకా అధ్యక్షురాలు ఎల్.సరోజిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి కె.ఎం.విజయలక్ష్మి, బి.రూతుమేరీ, బి.నిర్మల, డి.కె.హెలెన్, పద్మ జ తదితరులు పాల్గొన్నారు.