‘సీబీఎస్ఈ పరీక్ష’ పై పునరాలోచించండి : రాహుల్
ABN , First Publish Date - 2021-04-12T00:25:46+05:30 IST
సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం మే నెల 4 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, అయితే కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని అభ్యర్థించారు. ‘‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలి. నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వాములతో చర్చిస్తే బాగుంటుంది. ఇంకా ఎన్నిరకాలుగా దేశ యువతతో ఆటలాడుకుంటారు?’’ అంటూ రాహుల్ ప్రశ్నించారు.