చైనా బలగాలను ఎప్పుడు వెళ్లగొడతారు? మోదీకి రాహుల్ సూటి ప్రశ్న
ABN , First Publish Date - 2020-06-30T21:11:58+05:30 IST
న్యూఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగం చేయబోయే ముందు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు సంధించారు.
న్యూఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగం చేయబోయే ముందు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు సంధించారు. భారత్ నుంచి చైనా బలగాలను ఎప్పుడు వెళ్లగొడతారని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఓ వీడియో సందేశాన్ని కూడా ఆయన జతచేశారు.
వీడియోలో రాహుల్ మునుపటికి భిన్నంగా, కూల్గా కనిపించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లను ఆదుకోవాలని రాహుల్ ప్రధానికి సూచించారు.