రేపు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-06-24T05:07:17+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ‘‘దొంగలందరీకి మోదీ..

రేపు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ

గాంధీనగర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ‘‘దొంగలందరీకి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుంది?’’ అంటూ 2019 ఎన్నికల ర్యాలీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ ఎమ్మెల్యే పరువునష్టం దావా వేశారు. దీనిపై రేపు సూరత్ కోర్టులో జరిగే విచారణకు రాహుల్ హాజరుకానున్నారు. కాగా గురువారం రాహుల్ గాంధీ సూరత్‌కు రానున్నట్టు గుజరాత్ పీసీసీ చీఫ్ అమిత్ చవ్దా ధ్రువీకరించారు. ‘‘రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ సూరత్ చేరుకుంటారు. మళ్లీ 12-12:20 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతారు. ఆయన పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం కోర్టు విచారణ కోసం మాత్రమే ఆయన వస్తున్నారు..’’ అని అమిత్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-24T05:07:17+05:30 IST