రాహుల్ డ్రగ్స్ బానిస!.. మోదీ నిశాని వ్యక్తి!
ABN , First Publish Date - 2021-10-20T08:17:17+05:30 IST
ఈ నెల 30న సిందగి, హానగల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఉప ఎన్నికల వేళ కర్ణాటకలో మాటల తూటాల కలకలం
బెంగళూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఈ నెల 30న సిందగి, హానగల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ నిరక్షరాస్యుడని, నిశాని (వేలిముద్ర) వ్యక్తి అని కాంగ్రెస్ ట్విటర్లో విమర్శించగా, రాహుల్ డ్రగ్స్ బానిసని, డ్రగ్స్ అక్రమ సరఫరాదారుడని బీజేపీ ప్రతిగా ఆరోపించింది. కాగా.. తమ పార్టీ ట్వీట్పై చింతిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్ ప్రకటించారు. ట్వీట్ను తొలగించామని తెలిపారు. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్.. రాహుల్ మాదకద్రవ్యాల బానిస అంటూ ధ్వజమెత్తారు. ‘రాహుల్ ఎవరు? అతనో డ్రగ్స్ బానిస.. డ్రగ్స్ అక్రమ సరఫరాదారు. ఇది నేను చెప్పింది కాదు. మీడియాలో వచ్చింది’ అని విమర్శించారు.