వామపక్ష, రైతు సంఘాల నాయకుల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2021-10-19T05:32:12+05:30 IST

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 18: అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆల్‌ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం తలపెట్టిన రైల్‌రోకో జరగకుండా వామపక్ష నాయకులను పోలీసులు ఉదయం నుం

వామపక్ష, రైతు సంఘాల నాయకుల గృహ నిర్బంధం
అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాకినాడలో నినాదాలు చేస్తున్న వామపక్ష నాయకులు

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 18: అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆల్‌ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం తలపెట్టిన రైల్‌రోకో జరగకుండా వామపక్ష నాయకులను పోలీసులు ఉదయం నుంచి గృహ నిర్బంధం చేశారు. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు, కార్మిక సంఘాల నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడ కలెక్టరేట్‌  నుంచి అచ్చుతాపురం రైలు గేటు వద్దకు ర్యాలీగా వెళ్తున్న విప్లవ రైతు, కార్మిక సంఘాల నాయకులను కూడా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమాలకు మద్దతుగా చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో అణగదొక్కుతోందని విమర్శించారు. రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, వారు చూస్తూ ఊరుకోరని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాని తక్షణం బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-19T05:32:12+05:30 IST