ప్రయాణీకులకు శుభ వార్త చెప్పిన రైల్వే బోర్డు
ABN , First Publish Date - 2021-11-24T16:51:29+05:30 IST
రాజధాని, దురంతో, శతాబ్ధి, వందే భారత్, తేజస్, గతిమాన్ రైళ్ల ప్రయాణీకులకు రైల్వే బోర్డు శుభ వార్త చెప్పింది.
న్యూఢిల్లీ: రాజధాని, దురంతో, శతాబ్ధి, వందే భారత్, తేజస్, గతిమాన్ రైళ్ల ప్రయాణీకులకు రైల్వే బోర్డు శుభ వార్త చెప్పింది. అన్ని రైళ్లలో ఆహార సరఫరా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కారణంగా నిలిపేసిన సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామని రైల్వే బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా జాగ్రత్తలతో... రైళ్లలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐఆర్సిటిసి, అన్ని జోన్ల కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది.