రైల్వేలైన్ అభివృద్ధికి కృషి: ఉత్తమ్కుమార్రెడ్డి
ABN , First Publish Date - 2021-09-05T00:33:07+05:30 IST
పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రైల్వేలైన్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
మిర్యాలగూడ: పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రైల్వేలైన్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్ను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అత్యధిక మంది ప్రయాణికులను తరలించే రైళ్లతోపాటు బియ్యం, ధాన్యం, సిమెంట్ రవాణా చేసే గూడ్స్ బండ్లు ఈ రూట్లో నడుస్తాయన్నారు. ఇలాంటి రైల్వేలైన్ మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి విన్నవించినట్లు తెలిపారు. అక్టోబరు 5వ తేదీన సౌత్సెంట్రల్ రైల్వే జీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారని, అందులో ప్రస్తావించాల్సిన అంశాలను పరిశీలించేందుకు స్టేషన్ను సందర్శిస్తున్నట్లు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.