రైల్వేస్టేషన్లో జీఎం తనిఖీలు
ABN , First Publish Date - 2021-06-13T05:12:31+05:30 IST
రేణిగుంట రైల్వేస్టేషన్ను శనివారం జీఎం గజానన్మాల్యా అకస్మిక తనిఖీ చేశారు.
రేణిగుంట, జూన్ 12: రేణిగుంట రైల్వేస్టేషన్ను శనివారం జీఎం గజానన్మాల్యా అకస్మిక తనిఖీ చేశారు. రైల్వే మంత్రి పీయూ్షగోయల్ తిరుపతి పర్యటన రానున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి జీఎం, డీఆర్ఎం తదితర అధికారుల బృందం ముందస్తుంగా రేణిగుంట చేరుకుంది. దీంతో రైల్వే ఆస్పత్రి, ప్లాట్ఫాంలు, విశ్రాంతి భవనం, స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై జీఎం చర్చించారు. కరోనా విపత్తు సమయంలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి జీఎంను కలసి తిరుపతి, రేణిగుంట తదితరప్రాంతాల్లో అభివృద్ధి పనులపై చర్చించి, వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఎం అలోక్తివారీ, ఏడీఆర్ఎం సూర్యనారాయణ, ఆపరేషన్స్ మేనేజర్ ధనంజయలు తదితరులు పాల్గొన్నారు.