రైల్వేజోన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం: కేంద్రమంత్రి అశ్విని కుమార్
ABN , First Publish Date - 2021-07-24T01:25:29+05:30 IST
గతంలో కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ విశాఖకు
ఢిల్లీ: గతంలో కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ విశాఖకు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని కేంద్రమంత్రి అశ్విని కుమార్ కుండబద్దలు కొట్టారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ సమాధానం ఇచ్చారు. రైల్వే జోన్పై ఓఎస్డీ డీపీఆర్ పంపారని అశ్విని కుమార్ తెలిపారు. డీపీఆర్ ఇంకా పరిశీలనలోనే ఉందని అశ్విని కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైల్వేజోన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని కేంద్రమంత్రి అశ్విని కుమార్ ప్రకటించారు.