ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. చీటీలు కట్టించుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక..

ABN , First Publish Date - 2020-08-12T12:57:24+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, చీటీలు కట్టించుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక..

ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. చీటీలు కట్టించుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక..

సీతంపేట(విశాఖపట్నం): ఆర్థిక ఇబ్బందులు తాళలేక, చీటీలు కట్టించుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక ఓ వివాహిత ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందగా, మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేశారు. నాల్గో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేన్యూకాలని వెంకటేశ్వరకాలనీలో ఓలేటి లక్ష్మి(41), కనకరాజు దంపతులు కుమార్తె విశ్వకళ, కుమారుడు యశ్వంత్‌తో కలిసి నివాసముంటున్నారు. కనకరాజు ప్రైవేటు పనులు చేస్తుంటాడు. కుమారుడు బయట ప్రాంతంలో చదువుతున్నాడు. కుమార్తె కూడా ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది.


ఓలేటి లక్ష్మి స్థానికంగా చీటీలు నిర్వహిస్తున్నది. అదే విధంగా ఫైన్సాన్‌ కూడా తీసుకుని డబ్బులు వాడుకుంది. ఈ క్రమంలో చీటీల డబ్బులు చెల్లించాలని కొందరు ఆమెను నిలదీశారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక లక్ష్మి ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట తలుపునకు తాళం వేసి వెనుక ఉన్న తలుపులోంచి ఇంట్లోకి వెళ్లి గెడ వేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంటికి వచ్చిన లక్ష్మి కుమార్తె తాళం వేసి ఉండడంతో  వెనుకకు వెళ్లి చూసింది. తల్లి ఉరివేసుకుని ఉండడం చూసి కేకలు వేసింది. స్థానికులు వచ్చి తలుపులు విరగ్గొటి మృతదేహాన్ని కిందికి దించారు. కుమారుడికి ఈ విషయం తెలిసి సోమవారం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్‌కి తరలించి, కరోనా పరీక్షల అనంతరం మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-08-12T12:57:24+05:30 IST