రైలు పట్టాలపై పడిన తల్లీబిడ్డ

ABN , First Publish Date - 2022-01-13T16:45:40+05:30 IST

వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన యువరాణి, ఆమె 9 నెలల బిడ్డ రైలు డ్రైవర్‌ అప్రమత్తతో ప్రాణాలతో బయట పడ్డారు. వివరాలిలా... బెంగుళూరు వెళ్లేందుకు బుధవారం తన బిడ్డతో కలిసి కాట్పాడి రైల్వేస్టేషన్‌కు వచ్చిన యువరాణి రైలు కోసం

రైలు పట్టాలపై పడిన తల్లీబిడ్డ

                     - డ్రైవర్‌ అప్రమతతో తప్పిన ముప్పు


వేలూరు(చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన యువరాణి, ఆమె 9 నెలల బిడ్డ రైలు డ్రైవర్‌ అప్రమత్తతో ప్రాణాలతో బయట పడ్డారు. వివరాలిలా... బెంగుళూరు వెళ్లేందుకు బుధవారం తన బిడ్డతో కలిసి కాట్పాడి రైల్వేస్టేషన్‌కు వచ్చిన యువరాణి రైలు కోసం వేచి వుంది. ఆ సమయంలో ఆ ప్లాట్‌ఫారంపై ఆడుకుంటున్న ఆమె బిడ్డ... హఠాత్తుగా పట్టాల పైకి దొర్లాడు. ఇది గమనించిన యువరాణి కూడా తన బిడ్డను కాపాడుకునేందుకు పట్టాలపైకి దూకింది. అదే సమయంలో ప్లాట్‌ఫాంపైకి వస్తున్న యశ్వంత్‌పూర్‌ - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలెట్‌ మురుగేశన్‌ తల్లీబిడ్డల్ని గమనించి రైలును నిలిపేశారు. దీంతో తల్లీబిడ్డ ఆప్రణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కింద పడిన యువరాణి తలకు గాయమైంది. ఆమెను సీఎంసీలో చేర్పించారు. కాగా ఈ ఘటనతో ఆ రైలు అరగంట ఆలస్యంగా బయలుదేరింది.

Updated Date - 2022-01-13T16:45:40+05:30 IST