Railway station‌ ప్లాట్‌ఫాంపై ఆడశిశువు

ABN , First Publish Date - 2022-01-18T15:46:09+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు

Railway station‌ ప్లాట్‌ఫాంపై ఆడశిశువు

శిశువిహార్‌కు అప్పగించిన పోలీసులు 

హైదరాబాద్/అడ్డగుట్ట: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీను కథనం ప్రకారం.. ప్లాట్‌ఫాం నెంబరు 2లో ఇరవై రోజుల ఆడశిశువు దుస్తుల్లో కప్పి ఉండగా రైల్వే పోలీసులు గమనించారు. సీఐ శ్రీను శిశువును దివ్యదిశ స్వచ్ఛంద సంస్థ (చైల్డ్‌లైన్‌) సిబ్బందికి అప్పగించి అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్‌ఫాం నెంబరు 2పై సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2022-01-18T15:46:09+05:30 IST