రైల్వేకోడూరు విద్యార్థికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం.. ఎంతో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-12-03T16:07:07+05:30 IST
రైల్వేకోడూరు పట్టణానికి చెందిన..
రైల్వేకోడూరు రూరల్: రైల్వేకోడూరు పట్టణానికి చెందిన యువకుడికి టెక్సాస్లోని ప్రముఖ సాఫ్ట్వెర్ కంపెనీ థర్డ్ ఏఐకార్ప్లో రూ.95 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. చంద్రశేఖర్, మాధవిల కుమారుడు అదునుకోట యశ్వంత్ 10వ తరగతిలో 10/10, ఇంటర్మీడియట్లో 982/1000 మార్కులు, ఏపీ తెలంగాణ ఎంసెట్లో 15వ ర్యాంక్, జేఈఈ అడ్వాన్స్లో 233వ ర్యాంక్ సాధించాడు. ఖరగ్పూర్ ఐఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరి మంచి ప్రతిభ కనబరిచాడు. కాలేజీ ప్రాంగణ నియమకాలలో రూ.95 లక్షల ప్యాకేజీతో ఇటీవల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఇతడిని గురువారం గౌరీశంకర్ హైస్కూల్ కరస్పాండెంట్ గోపినాథ్ అభినందించారు.