సమయపాలనలో రైల్వేశాఖ సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2020-07-02T20:36:48+05:30 IST

భారత రైళ్ల పేరు చెబితే చాలు.. ఆలస్యానికి మారుపేరన్న అభిప్రాయాలు..

సమయపాలనలో రైల్వేశాఖ సరికొత్త రికార్డు

భారత రైళ్ళ పేరు చెబితే చాలు.. ఆలస్యానికి మారుపేరన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇదంతా గతంలో మాట. సమయపాలనలో భారత రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. వంద శాతం కచ్చితమైన వేళలను రైళ్లు పాటించి రికార్డు నమోదు చేశాయి. వారం రోజుల క్రితం రైళ్ళ కచ్చితమైన వేళలు 99.54 శాతంగా ఉంది. అప్పట్లో ఒక్క రైలు మాత్రమే ఆలస్యమైంది. అయితే అప్పటి రికార్డును చెరిపేస్తూ తాజాగా రైళ్లన్ని సమయానికి గమ్యస్థానాలకు చేరి రికార్డు సృష్టించాయి.

Updated Date - 2020-07-02T20:36:48+05:30 IST