గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2021-05-12T05:36:00+05:30 IST

ఖమ్మం జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారంతో భారీవర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకే కారుమబ్బులతో ఆకాశం చీకటిగా మారింది.

గాలివాన బీభత్సం
చింతకానిలో పంటలపై టార్పాలిన్‌ కప్పుతున్న రైతులు

 

ఖమ్మం జిల్లాలోపలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం

మామిడి, మిర్చి, వరి పంటలకు నష్టం

ఖమ్మం, మే11(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారంతో భారీవర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకే కారుమబ్బులతో ఆకాశం చీకటిగా మారింది. భారీ గాలి దుమారంతో వర్షం మొదలైంది. ఈ గాలివాన అరగంటకుపైగా విజృంభించడంతో  మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం  తడిచిపోయింది. పలుచోట్ల మొక్కజొన్నలు కూడా వర్షానికి తడిచాయి. అకాలవర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిలాల్లో ఎంత వర్షపాతం నమోదైంది. పంట నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం నగరంతోపాటు రఘునాధపాలెం, కామేపల్లి, కొణిజర్ల, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి తదితర మండలాల్లో వర్షం కురిసింది. వర్షం వస్తుందని అంచనావేసిన కొందరు రైతులు తమ పంటలపై  టార్బాలిన్‌లు కప్పారు. 

Updated Date - 2021-05-12T05:36:00+05:30 IST