తిరుమలలో ఎడతెరపిలేని వర్షం
ABN , First Publish Date - 2021-11-02T02:07:08+05:30 IST
తిరుమలలో సోమవారం ఎడతెరపి లేకుండా వర్షం పడింది.. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు భారీగా కురిసింది.
తిరుమల: తిరుమలలో సోమవారం ఎడతెరపి లేకుండా వర్షం పడింది.. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు భారీగా కురిసింది. ఆ తర్వాత రాత్రి వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి.శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లు, వసతిసముదాయాలు వర్షంతో తడిచిముద్దయ్యాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన వారూ ఇక్కట్లు ఎదుర్కొన్నారు.రెండుఘాట్రోడ్లలోనూ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలంటూ జీఎన్సీ, అలిపిరి టోల్గేట్లలో మైకుల ద్వారా సూచనలు చేశారు.వర్షం కురిసిన క్రమంలో తిరుమలలో చలితీవ్రత పెరిగింది. సాయంత్రం సమయంలో టీ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది.