కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం
ABN , First Publish Date - 2021-05-06T06:40:30+05:30 IST
తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వర్షం రావడంతో తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే రహదారి పై ఆరబోసిన ధాన్యం తడిసింది.
తుర్కపల్లి,మే 5: తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వర్షం రావడంతో తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే రహదారి పై ఆరబోసిన ధాన్యం తడిసింది. దీనికితోడు పలువురు రైతులు వ్యవ సాయ బావుల వద్ద కోసి న ధాన్యం తడవడంతో ఆందోళనకు గురయ్యారు.