India vs Sri Lanka: మ్యాచ్ను ఆపేసిన వర్షం
ABN , First Publish Date - 2021-07-23T22:45:26+05:30 IST
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తుది వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తుది వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది.23 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ను నిలిపిశారు. నెమ్మదిగా ప్రారంభమైన వర్షం క్రమంగా పెరిగి పెద్దదవుతోంది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మనీష్ పాండే 10, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. శిఖర్ ధవన్ (13) మరోమారు విఫలం కాగా పృథ్వీషా (49), సంజు శాంసన్ 46 పరుగులు చేశారు.