తీర ప్రాంత జిల్లాలకు ఐదు రోజుల పాటు Rainfall

ABN , First Publish Date - 2021-11-01T17:25:20+05:30 IST

శ్రీలంకకు చేరువగా కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఐదు రోజలుపాటు వర్షాలు కురిసే అవకాశం

తీర ప్రాంత జిల్లాలకు ఐదు రోజుల పాటు Rainfall

చెన్నై: శ్రీలంకకు చేరువగా కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఐదు రోజలుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకులు పువియరసన్‌ ప్రకటిం చారు. ఈ నెల రెండో తేదీ వరకు డెల్టా జిల్లాలైన పుదుకోట, రామనాథపురం, తిరునల్వేలి, తూత్తుకుడి, కడలూరు జిల్లాలు, కారైక్కాల్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలి పారు. ఇదే విధంగా కన్నియాకుమారి, విల్లుపురం, కాంచీపురం, తిరువ ళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయ న్నారు. ఇదిలా ఉండగా చెన్నైలో ఆదివారం వేకువ జామున, సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Updated Date - 2021-11-01T17:25:20+05:30 IST