తూర్పు మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

ABN , First Publish Date - 2020-08-15T00:55:21+05:30 IST

తూర్పు మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు, కూనవరం

తూర్పు మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

రాజమండ్రి: తూర్పు మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో  శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో లోతట్టు గ్రామాల్లోకి వరద ముంపు పొంచి ఉంది. దేవీపట్నం మండలంలోని 30గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం- కనకాయలంక కాజ్ వేపైకి వరద ప్రవహిస్తోంది. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.


గోదావరి ఉరకలు పరుగులు పెడుతుంది.. గడచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపీ పెరుగుతుంది. ఒక వైపు మారిన వాతావరణం, వరుసగా అల్పపీడన ద్రోణులు, వాయుగుండం కూడా జతకలియడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండడంతో గోదావరిలో వరద ఒక్కసారిగా ముంచు కొచ్చింది. వరద తీవ్రతను అంచనా వేయడంతో పాటు గోదావరిలో వరదను సీడబ్ల్యూసీ ఎప్పటి కప్పుడు అంచనా కడుతుంది.

Updated Date - 2020-08-15T00:55:21+05:30 IST