వయోపరిమితి 47 ఏళ్లకు పెంచండి

ABN , First Publish Date - 2021-05-07T10:11:45+05:30 IST

ఏపీపీఎ్‌ససీ, సచివాలయ ఉద్యోగాలకు ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు

వయోపరిమితి 47 ఏళ్లకు పెంచండి

రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌


విజయవాడ సిటీ, మే 6: ఏపీపీఎ్‌ససీ, సచివాలయ ఉద్యోగాలకు ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎ్‌సను అన్ని ఉద్యోగాలకు వర్తింపజేయాలని గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని కానిస్టేబుల్‌కు 25, ఎస్సై ఉద్యోగానికి 30, గ్రూప్‌ 1లో డీఎస్పీకి 33 ఏళ్లకు పెంచాలన్నారు. నియామకాల క్యాలెండర్‌లో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిని 47 ఏళ్లుగా కనీసం ఒక్క సంవత్సరమైనా అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-05-07T10:11:45+05:30 IST