ఢిల్లీలో రైతుల ఉద్యమానికి పలువురి మద్దతు
ABN , First Publish Date - 2020-12-05T06:08:54+05:30 IST
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు జిల్లాలో పలువురి మద్దతు లభిస్తోంది.
నల్లగొండ క్రైం, డిసెంబరు 4 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు జిల్లాలో పలువురి మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతుగా టీఎ్సయూటీఎఫ్ నాయకులు శుక్రవారం జిల్లాకేంద్రంలో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి ఎడ్ల సైదులు, కోశాధికారి పెరుమాళ్ల వెంకటేశం, యాక య్య, సరళ, నర్సింహ, శేఖర్రెడ్డి, చిప్పలపల్లి సైదులు, రాగి రవీందర్, నాగయ్య, నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, భానుప్రకాష్, రమణ, శ్యాం సుందర్, మీనయ్య, సైదులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : ఢిల్లీలో రైతులు చేసున్న పోరాటానికి నల్లగొండ జిల్లా న్యాయవాదులు శుక్రవారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన చట్టాలతో మార్కెటింగ్ వ్య వస్థ రద్దయి రైతులకు మద్దతు ధర అందదన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు అనంతుల శంకరయ్య, గుండె వెంకటేశ్వర్లు, మల్లేపల్లి ఆదిరెడ్డి, మునగాల నారాయణరావు, బీమార్జున్రెడ్డి, ఎండీ.నజీరుద్దీన్, బ్రహ్మచారి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.