కరోనాపై 15 నెలల్లో 355 వీడియో కాన్ఫరెన్సులు పెట్టిన రాజస్థాన్ సీఎం

ABN , First Publish Date - 2021-06-15T05:26:06+05:30 IST

కరోనాపై 15 నెలల్లో 355 వీడియో కాన్ఫరెన్సులు పెట్టిన రాజస్థాన్ సీఎం

కరోనాపై 15 నెలల్లో 355 వీడియో కాన్ఫరెన్సులు పెట్టిన రాజస్థాన్ సీఎం

జైపూర్: కొవిడ్-19 మహమ్మారిపై గడచిన 15-16 నెలల కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దాదాపు 355 వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించినట్టు ప్రభుత్వం ఇవాళ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత తలెత్తిన ఆరోగ్య సమస్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు చేసిన సూచన మేరకు ఆయన ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనడం లేదు. ‘‘కరోనా కారణంగా అసాధారణ స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. గడచిన 15-16 నెలల కాలంలో దాదాపు 355 వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాం.. ’’ ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాల్స్ ద్వారానే జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-06-15T05:26:06+05:30 IST