మూడు రాజధానులెవరు అడిగారు?

ABN , First Publish Date - 2021-11-27T05:14:15+05:30 IST

మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారు.. అమరావతిని పక్కన పెట్టి మూడు ముక్కలపై పాలకులు ఎందుకు శ్రద్ధ చూపుతున్నారని రాజధాని రైతులు, మహిళలు ప్రశ్నించారు.

మూడు రాజధానులెవరు అడిగారు?
పెదపరిమి శిబిరంలో ఆందోళనలు చేస్తున్న రైతులు

710వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, నవంబరు 26: మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారు.. అమరావతిని పక్కన పెట్టి మూడు ముక్కలపై పాలకులు ఎందుకు శ్రద్ధ చూపుతున్నారని రాజధాని రైతులు, మహిళలు ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో 710వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ  తొలుత అమరావతికి మద్దతు ఇచ్చి అధికారం చేపట్టాక స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారన్నారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడంలేదన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడానికే మూడు ముచ్చట చెపుతున్నారని తెలిపారు.  రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు, అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  

  

Updated Date - 2021-11-27T05:14:15+05:30 IST