Rajahmundry: సహజీవనం కోసం కుమార్తె, కుమారుడిని హత్య చేసిన కసాయి తల్లి

ABN , First Publish Date - 2021-10-11T13:05:08+05:30 IST

ఆనంద్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డలన్ని అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి ఇద్దరు పిల్లలను ఉరేసి చంపింది తల్లి పూరేటి లక్ష్మీఅనూష. ఈ ఘటన ఆనంద్‎నగర్‎లో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా లక్ష్మీ బ్యూటీషియన్‎గా పనిచేస్తూ

Rajahmundry: సహజీవనం కోసం కుమార్తె, కుమారుడిని హత్య చేసిన కసాయి తల్లి

రాజమండ్రి: ఆనంద్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డలన్ని అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి ఇద్దరు పిల్లలను ఉరేసి చంపింది తల్లి పూరేటి లక్ష్మీఅనూష. ఈ ఘటన ఆనంద్‎నగర్‎లో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా లక్ష్మీ బ్యూటీషియన్‎గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తుంది. అయితే..కొద్దీ రోజుల క్రితం లక్ష్మీకి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తితో సహజీవనం వరకు వెళ్లింది. తన సహజీవనానికి తరచూ తన కుమార్తె చిన్మయి(8), కుమారుడు మోహిత్(6) అడ్డు ఉన్నారని కన్నబిడ్డలని చూడకుండా ఉరేసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసులు లక్ష్మీఅనూషపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-10-11T13:05:08+05:30 IST