పట్టాభిని కస్టడీకి ఇవ్వండి
ABN , First Publish Date - 2021-10-23T08:54:32+05:30 IST
టీడీపీ నాయకుడు పట్టాభిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడలోని మూడో ఏసీఎంఎం కోర్టులో గవర్నరుపేట పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టులో పోలీసుల పిటిషన్
రాజమహేంద్రవరం సిటీ/మచిలీపట్నం టౌన్, అక్టోబరు 22: టీడీపీ నాయకుడు పట్టాభిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడలోని మూడో ఏసీఎంఎం కోర్టులో గవర్నరుపేట పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పట్టాభికి నోటీసులు జారీచేయాలని ఆదేశించిన న్యాయమూర్తి సత్యాదేవి, విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు.