రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
ABN , First Publish Date - 2022-01-27T05:09:52+05:30 IST
రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుతూ బుధవారం రాత్రి జనసేన నాయకులు రాజంపేట అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.
రాజంపేట, జనవరి 26 : రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుతూ బుధవారం రాత్రి జనసేన నాయకులు రాజంపేట అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ నేత చంగారి శివప్రసాద్ మాట్లాడుతూ బ్రిటీషు కాలం నుంచి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, పార్లమెంట్ కేంద్రంగా అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా కనీసం గుక్కెడు నీళ్లు దొరకని రాయచోటిని ఎలా జిల్లా చేస్తారని ప్రశ్నించారు. రాజంపేట జిల్లాను చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధరెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కరుణాకర్రాజు, కత్తి సుబ్బరాయుడు, హరి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. కాగా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర కాపునాడు ఆర్గనైజింగ్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బుధవారం రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.