రాజమండ్రిలో కలకలం.. తుప్పల్లో దంపతుల మృతదేహాలు
ABN , First Publish Date - 2020-03-27T15:59:31+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది.
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానస్పదంగా మృతి చెందారు. సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృతదేహాలు ఉండటంతో కలకలం రేగింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
కాగా.. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది..? ఈ దంపతులు ఎవరు..? ఎవరు ఈ దారుణానికి పాల్పడి ఉంటారు..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో ఈ కేసు ఛేదిస్తామని పోలీసులు మీడియాకు వెల్లడించారు.