రాజన్న హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2021-07-30T06:39:35+05:30 IST
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా కోటి 20 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది.
- 1.20 కోట్లు ఆదాయం
వేములవాడ, జూలై 29: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా కోటి 20 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. 25 రోజుల వ్యవధిలో భక్తులు శ్రీస్వామివారికి హుండీలలో సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను గురువారం నాడు ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 20 లక్షల 49 వేల 368 రూపాయల నగదు, 198 గ్రాముల బంగారం, 11 కిలోల 500 గ్రాముల వెండి సమకూరింది. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ హుండీ లెక్కింపు పర్యవేక్షించారు.