రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 12 లక్షలు

ABN , First Publish Date - 2021-12-01T05:51:33+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది.

రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 12 లక్షలు
రాజన్న ఆలయ ఆవరణలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

వేములవాడ, నవంబరు 30 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఆరు రోజుల వ్యవధిలో భక్తులు  స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 12 లక్షల 46 వేల 660 రూపాయల నగదు, 193 గ్రాముల 150 మిల్లీ గ్రాముల బంగారం, 13 కిలోల 820 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-01T05:51:33+05:30 IST