రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 12 లక్షలు
ABN , First Publish Date - 2021-12-01T05:51:33+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది.
వేములవాడ, నవంబరు 30 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఆరు రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 12 లక్షల 46 వేల 660 రూపాయల నగదు, 193 గ్రాముల 150 మిల్లీ గ్రాముల బంగారం, 13 కిలోల 820 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.