ఎంపీడీవో కార్యాలయం ఎదుట కుటుంబం ధర్నా

ABN , First Publish Date - 2021-11-24T20:47:54+05:30 IST

తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆందోళనకు దిగింది.

ఎంపీడీవో కార్యాలయం ఎదుట కుటుంబం ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. కార్యాలయానికి తాళం వేసి అధికారులను సయితం లోపలకు రానివ్వకపోవడం కలకలం రేపింది. తనకు కొందరు టీఆర్ఎస్ నేతలు స్థలాన్ని అమ్మారని.. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుండగా వేరే అధికారులకు ఫిర్యాదు చేసి జేసీబీతో ఇంటిని కూల్చివేశారని ఆ కుటుంబం ఆరోపించింది. విషయం బయటకు రాకుండా రూ. 4 లక్షలతోపాటు స్థలం కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని బాధితుడు తెలిపాడు. ఒప్పందం జరిగి ఏడాది అయినా.. ఇంతవరకు స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-11-24T20:47:54+05:30 IST