టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు: రాజాసింగ్
ABN , First Publish Date - 2020-11-30T18:39:58+05:30 IST
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేస్తున్నారన్నారు. పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు పంచుతున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఓటు కోసం రూ.500 తీసుకుంటే.. ఐదేళ్లు గులాంగిరి చేయాలని రాజాసింగ్ పేర్కొన్నారు.