వీధిలో ఫోన్ చూస్కుంటూ నడుస్తున్న వ్యక్తి.. ఇంతలోనే భారీ శబ్ధం.. ఏంటా అని వెనక్కు తిరిగి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-17T18:22:24+05:30 IST

ఓ వ్యక్తి ఫోన్ చూసుకుంటు వీధిలో..

వీధిలో ఫోన్ చూస్కుంటూ నడుస్తున్న వ్యక్తి.. ఇంతలోనే భారీ శబ్ధం.. ఏంటా అని వెనక్కు తిరిగి చూస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: ఓ వ్యక్తి ఫోన్ చూసుకుంటు వీధిలో నడుచుకుంటు వెళ్తున్నాడు. ఆయన వెనుక ఏదో పడిన శబ్ధం వచ్చింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూశాడు. అంతే.. ఒక్కసారిగా బిత్తరపోయి పక్కకు జరిగాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాలోని బయానా పోలీస్‌‌స్టేషన్ పరిధిలో అంబా టాకీస్ దగ్గర హరిజన బస్తీ ఉంది. సోమవారం సాయంత్రం ఆ బస్తీలో ఓ యువకుడు నడుచుకుంటు వెళ్తుండగా.. ఆయనకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. తన వెనుక ఏదో పడినట్టు శబ్ధం వచ్చి వెనక్కి తిరిగాడు. అంతే అక్కడ పడింది చూసి ఖంగుతిన్నాడు. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దెపైనుంచి కింద పడ్డాడు. కిందపడిన వ్యక్తి పేరు సురేష్. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది.





సోమవారం సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగొచ్చాకా.. మద్యం సేవించాలని సురేష్ మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. అతడి తల నేరుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్ కిందకు పడ్డాడని తెలిసి ఆయన భార్య గట్టిగా కేకలు వేసుకుంటు బయటకు వచ్చింది. సురేష్ మరణించాడని చెప్పినా అతడి భార్య వినలేదు. దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సురేష్ చనిపోయాడని వైద్యులు పేర్కొన్నారు. సురేష్ కిందపడిన సంఘటన మొత్తం అతడి ఇంటిపక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.  


సురేష్ భార్య మీడియాతో మాట్లాడుతూ తమకు ముగ్గురు పిల్లలున్నారని, తమది పేద తరగతి కుటుంబమని చెప్పింది. పనికి వెళ్తేగానీ తమ కడుపు నిండని పరిస్థితి అని చెప్పింది. మద్యానికి బానిసైన తన భర్త ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి కిందపడి మరణించాడని తెల్పింది.

Updated Date - 2021-11-17T18:22:24+05:30 IST