ఐదుగురు చిన్నారులను బలిగొన్న దాగుడుమూతలాట!
ABN , First Publish Date - 2021-03-22T16:03:08+05:30 IST
రాజస్థాన్లోని బికనేర్లో దాగుడు మూతలాటలో మునిగిన చిన్నారులు...
బికనేర్: రాజస్థాన్లోని బికనేర్లో దాగుడు మూతలాటలో మునిగిన చిన్నారులు ఒక ధాన్యం కంటైనర్లో దాక్కున్నారు. ఈ నేపధ్యంలో ఊపిరాడటక ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతులలోని నలుగురు తోడబుట్టినవారు కావడం గమనార్హం. వారు ధాన్యం కంటైనర్లోకి దూరగానే అది మూసుకుపోవడంతో వారికి ఊపిరి ఆడలేదు.
ఈ ఘటన బికనేర్ పరిధిలోని హిమ్మత్సర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోతా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులంతా ఎనిమిదేళ్లలోపు వయసు గల చిన్నారులు. కాగా చిన్నారులు ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీసుకువచ్చి, ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి అప్పటికే వారు మృతి చెందారని నిర్ధారించారు.