రాజస్థాన్లో పూర్తిగా తెరుచుకోనున్న ప్రభుత్వ కార్యాలయాలు
ABN , First Publish Date - 2020-06-02T00:17:03+05:30 IST
లాక్డౌన్ 5.0లో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని...
జైపూర్: లాక్డౌన్ 5.0లో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ప్రైవేటు సంస్థలకు కూడా పూర్తి స్థాయి సిబ్బందితో పనిచేయవచ్చని, కానీ వర్క్ ఫ్రం హోంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనాలయాలు, మాల్స్ తెరచుకునేందుకు వీలు లేదని ప్రకటించింది. స్టాల్స్లలో ఆహార పదార్థాలను విక్రయించుకునేందుకు మాత్రం అనుమతిస్తున్నామని, అయితే సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను మాత్రం కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం వ్యాపారులను హెచ్చరించింది.