సోదరుడితోపాటు బయటకు వెళ్లొచ్చిన 17ఏళ్ల యువతిలో మానసిక ఆందోళన గమనించి.. తల్లి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి..!

ABN , First Publish Date - 2021-10-10T19:01:03+05:30 IST

వరుసకు సోదరుడే కదా..

సోదరుడితోపాటు బయటకు వెళ్లొచ్చిన 17ఏళ్ల యువతిలో మానసిక ఆందోళన గమనించి.. తల్లి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి..!

ఇంటర్‌నెట్‌డెస్క్‌: వరుసకు సోదరుడే కదా అని తల్లిదండ్రులు ఆ యువతిని బయటకు పంపించారు. ఇంటికి తిరిగొచ్చాక కూతురు దిగులుగా ఉండడం గమనించి తల్లికి అనుమానం కలిగింది. ఏమైంది అని అడగ్గా.. ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


రాజస్థాన్‌లోని జైపూర్‌‌లోని చాంద్‌పోల్ ప్రాంతానికి చెందిన ఓ 17ఏళ్ల యువతి వరుసకు సోదరుడైన మనీష్ గోత్వాల్‌తో కలిసి శనివారం గల్టా ధామ్ సందర్శించడం కోసం బయటకు వెళ్లింది. ఆ ప్రదేశమంతా చూశాకా అన్నా చెల్లెలిద్దరూ సాయంత్రం 6గంటలకు ఇంటికి బయలుదేరారు. కొంతదూరం వెళ్లాకా ఓ అటవీ ప్రాంతం దగ్గర సోదరుడు బైక్ ఆపాడు. ‘అలసటగా ఉంది.. ఏదైనా కూల్‌డ్రింక్ తాగి వెళ్దాం’అని చెప్పాడు. తనపై అన్నకు ఎంతో అభిమానం ఉందని ఆ చెల్లి సంబరపడింది. కానీ ఆ యువతి సోదరుడి దుర్భుద్ధి గమనించలేదు.



ఎందుకంటే ఆ నీచుడు మత్తు పదార్థం కలిపిన ఓ పానీయంను తెచ్చి ఆ యువతికి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా.. కూతురిలో మానసిక ఆందోళన గమనించిన తల్లి ఏమైందని అడిగింది. దీంతో ఆ యువతి జరిగిన విషయం చెప్పింది. నీచుడికి శిక్ష పడాలని తల్లిదండ్రులు యువతిని తీసుకెళ్లి మొదటగా కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన గల్టా అటవీ ప్రాంతం.. గట్వా పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



Updated Date - 2021-10-10T19:01:03+05:30 IST