తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్

ABN , First Publish Date - 2021-04-20T03:31:26+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌....

తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌.. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ మనన్ ఓహ్రా(14: 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) శామ్ కర్రాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. శామ్ వేసిన ఓ షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద రవీంద్ర జడేజాకు చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో జాస్ బ్లర్(15: 11 బంతుల్లో.. 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-04-20T03:31:26+05:30 IST