38 మంది మహిళలు, పిల్లల కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2021-01-07T13:15:27+05:30 IST

కత్తులు, కటార్లతో బస్సులో 100మంది ఓ గ్రామానికి వచ్చి, బెదిరించి 38 మంది మహిళలు, పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఘటన....

38 మంది మహిళలు, పిల్లల కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

ఝాల్వార్ (రాజస్థాన్): కత్తులు, కటార్లతో బస్సులో 100మంది ఓ గ్రామానికి వచ్చి, బెదిరించి 38 మంది మహిళలు, పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝాల్వార్ జిల్లాలో జరిగింది. ఝాల్వార్ జిల్లా బామన్ దేవారియాన్ గ్రామానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా నుంచి 100మంది దుండగులు బస్సు ఇతర వాహనాల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని ఝాల్వార్ జిల్లా బామన్ దేవారియాస్ గ్రామానికి కత్తులు, కటార్లతో వచ్చి బెదరించి 38 మంది మహిళలు, పిల్లలను ఎత్తుకెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి కిడ్నాప్ అయిన 38 మంది మహిళలు, పిల్లల్ని కాపాడారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశామని ఝాల్వార్ జిల్లా ఎస్పీ డాక్టర్ కిరణ్ కంగ్ సింధూ చెప్పారు. ఈ ఘటనలో నిందితులు కొందరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని ఎస్పీ సింధూ చెప్పారు. మహిళలు, పిల్లల కిడ్నాప్ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సింధూ వివరించారు. 

Updated Date - 2021-01-07T13:15:27+05:30 IST