టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ABN , First Publish Date - 2021-04-20T00:39:40+05:30 IST
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండో జట్లూ టోర్నీలో..
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండో జట్లూ టోర్నీలో తొలిసారి పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లూ గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగుతున్నాయి. కాగా.. పంజాబ్పై గెలిచి చెన్నై ఊపుమీదుండగా.. ఢిల్లీపై గెలుపుతో రాజస్థాన్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లూ 23 సార్లు తలపడగా.. 14 సార్లు చెన్నై గెలిచింది. 9 సార్లు రాజస్థాన్ విజయకేతనం ఎగురవేసింది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరున్న ధోనీని, కేవలం రెండు మ్యాచ్లే కెప్టెన్గా అనుభవమున్న సంజు ఎలా ఎదుర్కొటాడో చూడాలి.