హైదరాబాద్‌లో 53 చెరువులు డ్యామేజ్‌: రజత్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-10-21T20:01:15+05:30 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండి పోయాయని..

హైదరాబాద్‌లో 53 చెరువులు డ్యామేజ్‌: రజత్‌కుమార్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండి పోయాయని ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు 15 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గండిపడిన 3 చెరువులకు మరమ్మతులు చేస్తున్నామని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. ముసాపేట్‌, బండ్లగూడ, మాన్సూరాబాద్‌ చెరువులు తెగలేదని వెల్లడించారు. చెరువులకు గండిపడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. చెరువుల కబ్జాపై చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌లో 53 చెరువులు డ్యామేజ్‌ అయ్యాయని ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. 


Updated Date - 2020-10-21T20:01:15+05:30 IST