హైదరాబాద్లో 53 చెరువులు డ్యామేజ్: రజత్కుమార్
ABN , First Publish Date - 2020-10-21T20:01:15+05:30 IST
హైదరాబాద్: హైదరాబాద్లో 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండి పోయాయని..
హైదరాబాద్: హైదరాబాద్లో 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండి పోయాయని ఇరిగేషన్శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు 15 టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. గండిపడిన 3 చెరువులకు మరమ్మతులు చేస్తున్నామని రజత్కుమార్ పేర్కొన్నారు. ముసాపేట్, బండ్లగూడ, మాన్సూరాబాద్ చెరువులు తెగలేదని వెల్లడించారు. చెరువులకు గండిపడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. చెరువుల కబ్జాపై చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్లో 53 చెరువులు డ్యామేజ్ అయ్యాయని ఇరిగేషన్శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.