ఐదో దశ లాక్డౌన్ ఉన్నా లేకున్నా... మీరు మాత్రం ఇది చేయండి : రాజీవ్ గౌబా ఆదేశం
ABN , First Publish Date - 2020-05-28T21:39:43+05:30 IST
అయితే ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటు, కార్పొరేషన్ కమిషనర్లను కూడా చేర్చారు. వీరు పాల్గొనడం
న్యూఢిల్లీ : లాక్డౌన్ 5.0 పై వివిధ రాష్ట్రాలు శనివారం వరకూ తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితులు మరింత బాగు పడాలంటే ఏం చేయాలో కూడా సూచనలు పంపాలని, మే 31 తర్వాత తమ తమ రాష్ట్రాల్లో ఎలాంటి కొత్త రకమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కూడా ఆయన కోరారు.
అయితే ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటు, కార్పొరేషన్ కమిషనర్లను కూడా చేర్చారు. వీరు పాల్గొనడం ఇదే ప్రథమం. దేశంలో ఐదో దశ లాక్డౌన్ ఉన్నా లేకున్నా అన్ని రాష్ట్రాలు మాత్రం లాక్డౌన్పై సలహాలు, సూచనలు అందించాల్సిందేనని గౌబా సీఎస్లను ఆదేశించారు.