ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్గా రాజీవ్ జోషి
ABN , First Publish Date - 2020-05-27T07:46:02+05:30 IST
భారతీయ-అమెరికన్ ఆవిష్కర్త రాజీవ్ జోషి ప్రతిష్ఠాత్మక ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.
వాషింగ్టన్ మే 26: భారతీయ-అమెరికన్ ఆవిష్కర్త రాజీవ్ జోషి ప్రతిష్ఠాత్మక ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఎలక్ర్టానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ ఈ నెల ప్రారంభంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది. రాజీవ్ ప్రస్తుతం న్యూయార్క్లోని ఐబీఎం థామ్సన్ వాట్సన్ రీసెర్చ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 250కిపైగా ఆవిష్కరణల్లో పాలుపంచుకున్నారు. వీటి అనువర్తనాలను సూపర్ కంప్యూటర్స్, ప్రాసెసర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాల్లో వినియోగిస్తున్నారు.