కనీసం ఒక అంగుళం భూమినైనా చైనాకు వదిలేది లేదు : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2020-10-25T19:39:59+05:30 IST

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణ జరగాలని భారత

కనీసం ఒక అంగుళం భూమినైనా చైనాకు వదిలేది లేదు : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణ జరగాలని భారత దేశం కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మన దేశ సైన్యం మన దేశ భూభాగంలో కనీసం ఒక అంగుళం భూమినైనా చైనాకు వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు. సిలిగురిలో కీలక సైనిక స్థావరమైన 33 కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌లో  ఆయుధ పూజ నిర్వహించిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. 


ఉద్రిక్తతలు సమసిపోవాలని, శాంతి పునరుద్ధరణ జరగాలని భారత దేశం కోరుకుంటోందని చెప్పారు. మన సైన్యం మన భూభాగంలో కనీసం ఒక అంగుళం భూమినైనా  ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వదనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఆయుధ పూజ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ జనరల్ ఎంఎం నరవనే, ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 


రాజ్‌నాథ్ సింగ్ షెడ్యూలు ప్రకారం వాస్తవాధీన రేఖ సమీపంలోని సిక్కింలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న షెరతాంగ్‌లో ఆయుధ పూజ చేయవలసి ఉంది. కానీ తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు. 


మే నెల నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి, దౌత్య స్థాయి, మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రతిష్టంభనకు తెరపడటం లేదు. 


Updated Date - 2020-10-25T19:39:59+05:30 IST