పాక్ పర్యటనకు జింబాబ్వే కోచ్ రాజ్పుత్ దూరం
ABN , First Publish Date - 2020-10-21T08:48:32+05:30 IST
పాకిస్థాన్ పర్యటన నుంచి జింబాబ్వే కోచ్, భారత మాజీ ఆటగాడు లాల్చంద్ రాజ్పుత్ వైదొలిగాడు. హరారేలోని భారత దౌత్య కార్యాలయం కోరిన మీదట పాక్ టూర్ నుంచి రాజ్పుత్కు మినహాయింపు ఇచ్చినట్టు జింబాబ్వే క్రికెట్ ట్వీట్ చేసింది
కరాచీ: పాకిస్థాన్ పర్యటన నుంచి జింబాబ్వే కోచ్, భారత మాజీ ఆటగాడు లాల్చంద్ రాజ్పుత్ వైదొలిగాడు. హరారేలోని భారత దౌత్య కార్యాలయం కోరిన మీదట పాక్ టూర్ నుంచి రాజ్పుత్కు మినహాయింపు ఇచ్చినట్టు జింబాబ్వే క్రికెట్ ట్వీట్ చేసింది. లాల్చంద్ గైర్హాజరీలో బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండో జట్టును పర్యవేక్షించనున్నట్టు తెలిపింది. ఈనెల 30 నుంచి జరిగే పర్యటనలో ఆతిథ్య పాక్తో జింబాబ్వే 3 వన్డేలు, 3 టీ20ల సిరీ్సల్లో తలపడనుంది. భారత ప్రభుత్వ సూచనలతోనే రాజ్పుత్ను పర్యటనకు దూరం చేసినట్టు పాక్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. 2018లో జింబాబ్వే కోచ్గా రాజ్పుత్ నియమితుడయ్యాడు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులు పాక్లో పర్యటించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.