రాజ్యసభలో అడుగు పెట్టడం అదృష్టం: బోస్‌

ABN , First Publish Date - 2020-07-18T11:28:56+05:30 IST

రాజ్యసభలో అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈనెల22న ఢిల్లీలో స్పీకర్‌ చాంబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ..

రాజ్యసభలో అడుగు పెట్టడం అదృష్టం: బోస్‌

అల్లవరం, జూలై 17: రాజ్యసభలో అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈనెల22న ఢిల్లీలో స్పీకర్‌  చాంబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని రాజ్యసభ సభ్యు డు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. మొగళ్లమూరిలో ఎంపీ చింతా అనురాధ స్వగృహంలో శు క్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాణ స్వీకారానికి ఎంపీ అ నురాధను  ఆహ్వానించేందుకు  విచ్చేసినట్టు చెప్పారు. సీఎం జగన్‌ కృషి వల్లే తాను రాజ్య సభ లో అడుగుపెడుతున్నానని అన్నారు. బోస్‌ను ఎంపీ అనురాధ, పలువురు వైసీసీ నాయకులు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఎంపీ చింతా అనురాధ, పీఏసీ సభ్యుడు కుడుపూడి శ్రీను, నాతి శ్రీనివాసరావు, రుద్రరాజు సీతాపతిరాజు, బొంతు శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T11:28:56+05:30 IST